News September 23, 2025

నేడు శ్రీ గాయత్రీ దేవి అవతారం.. ఏ పూలతో పూజ చేయాలి?

image

దసరా నవరాత్రుల్లో రెండో రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు.. ఈ రూపంలో శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి, పంచ ముఖాలు, పది కళ్లతో, భూమి, ఆకాశం, సృష్టిని సూచించే రంగుల కిరీటంతో ముక్తా, హేమ, నీల, విద్రుమ, ధవళ వర్ణాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పించాలి. పసుపు రంగు పూలతో పూజించాలి. ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదించాలి.

Similar News

News September 23, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం

image

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న పుట్ట మట్టిని సేకరించి, అందులో నవధాన్యాలను నాటుతారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ఉత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంటుందని ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ తెలిపారు.

News September 23, 2025

తిరుమల బ్రహ్మోత్సవాల్లో 16 రకాల వంటకాలు

image

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో (Sept 24-Oct 2) భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నారు. వాహన సేవలు తిలకించేందుకు 36 LED స్క్రీన్‌లు అమర్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు 60 టన్నుల పుష్పాలు వినియోగిస్తున్నారు. రోజూ 8L లడ్డూలు అందుబాటులో ఉంటాయి. 229 కళాబృందాల ప్రదర్శనలు ఉంటాయి. భద్రత కోసం 3K సీసీ కెమెరాలు, 7K పైగా సిబ్బందిని నియమించారు.

News September 23, 2025

WIతో టెస్ట్ సిరీస్.. భారత జట్టు ఇదేనా?

image

వెస్టిండీస్‌తో OCT 2 నుంచి స్వదేశంలో జరగనున్న 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు BCCI ఇవాళ జట్టును ప్రకటించే అవకాశముంది. కాలి గాయం నుంచి పంత్ కోలుకోకపోవడంతో టీమ్‌కు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో Cricbuzz 15 మంది సభ్యులతో ఎక్స్‌పెక్టెడ్ స్క్వాడ్‌ను ప్రకటించింది.
IND(అంచనా): గిల్(C), జైశ్వాల్, రాహుల్, సుదర్శన్, పడిక్కల్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, ప్రసిద్ధ్, నితీశ్, జగదీశన్