News September 23, 2025

మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలి: బాస్ అధ్యక్షుడు

image

ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని భారతీయ అంబేడ్కర్ సేన(బాస్) అధ్యక్షుడు పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు. మదనపల్లె ప్రజలకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మదనపల్లెలోని బాస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6నెలల్లోనే జిల్లాగా ప్రకటిస్తామని ఎన్నికల్లో కూటమి నాయకులు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

Similar News

News September 23, 2025

ఒరాకిల్ చేతికి టిక్‌టాక్

image

చైనాకు చెందిన పాపులర్ SM యాప్‌ టిక్‌టాక్‌ను USలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్‌ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.

News September 23, 2025

మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

image

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.

News September 23, 2025

SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

image

<>SBI <<>>15 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/