News September 23, 2025

సూర్యలంక బీచ్ ఫెస్టివల్ వాయిదా

image

AP: బాపట్లలోని సూర్యలంక తీరంలో ఈ నెల 26, 27, 28వ తేదీలలో నిర్వహించాల్సిన బీచ్ ఫెస్టివల్ వాయిదా పడింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటక శాఖ తెలిపింది. నిన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి అధికారులకు ఇదే విషయాన్ని తెలియజేశారు. త్వరలోనే కొత్త తేదీలను నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.

Similar News

News September 23, 2025

ఒరాకిల్ చేతికి టిక్‌టాక్

image

చైనాకు చెందిన పాపులర్ SM యాప్‌ టిక్‌టాక్‌ను USలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్‌ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.

News September 23, 2025

SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

image

<>SBI <<>>15 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News September 23, 2025

మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

image

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.