News September 23, 2025
HYD: రోప్వే కోసం HMDA అడుగులు!

హైదరాబాద్.. చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. గొప్ప వారసత్వ సంపద కలిగిన నగరాన్ని లక్షలాది మంది సందర్శిస్తుంటారు. సిటీకి వచ్చే టూరిస్టులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు HMDA రోప్వేకు ప్లాన్ చేస్తోంది. గోల్కొండ నుంచి 7 టూంబ్స్ వరకు రోప్వే నిర్మించాలని నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయడం కోసం నైట్ ఫ్రాంక్ అనే సంస్థను ఎంపిక చేసింది. 3 నెలలో HMDAకు ఈ సంస్థ నివేదిక అందజేయాల్సి ఉంది.
Similar News
News September 23, 2025
GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్ !

అమరావతి ప్రాంతం వరద్దల్లో మునిగిపోయిందని GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ FB వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే మన డ్రోన్ కేపిటల్, క్వాంటంవాలీ, అతిపెద్ద రైల్వేస్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అంటూ సెటైర్లు విసిరారు. FB పోస్ట్ను సీరియస్గా తీసుకున్న AP ప్రభుర్వం వివరణ కోరుతూ మెమో జారీ చేసింది. వివరణలో పోస్ట్ నా వ్యక్తిగతం అంటూ సుభాష్ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం.
News September 23, 2025
ఒరాకిల్ చేతికి టిక్టాక్

చైనాకు చెందిన పాపులర్ SM యాప్ టిక్టాక్ను USలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.
News September 23, 2025
మేడారం చరిత్రలో తొలిసారి.. జాతరకు ముందే CM రాక

మేడారం మహాజాతర చరిత్రలో కొత్త అంశం చేరనుంది. 4 రోజులపాటు జరిగే ఈ ‘జనజాతర’కు రాష్ట్ర ముఖ్యమంత్రులు రావడం పరిపాటే. మేడారం జాతరను 1996లో రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత అమ్మల దగ్గరకు CMల రాక మొదలైంది. కాగా, ఇది ఆచారంగా మారి CMలందరూ జాతర టైంలో వచ్చి తల్లులను దర్శించుకుంటున్నారు. కానీ, తొలిసారిగా CM రేవంత్ జాతరకు ముందే వచ్చి జాతర నిర్వహణపై సమీక్షించనున్నారు. దీంతో మేడారం అభివృద్ధిపై అంచనాలు పెరిగాయి.