News September 23, 2025
కోటబొమ్మాళి: హెలికాప్టర్ రైడ్కు ఇంకా ఎన్ని టికెట్లు ఉన్నాయంటే?

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాల్లో భాగంగా సోమవారానికి హెలికాప్టర్ రైడ్ చేసేందుకు 92 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా 158 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. నేటి నుంచి 25 వరకు వాతావరణం దృష్టిలో ఉంచుకొని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రైడ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News September 24, 2025
ఎచ్చెర్ల: ‘ఈ నెల 25 నుంచి అంబేడ్కర్ యూనివర్సిటీకి దసరా సెలవులు’

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, అనుబంధ కళాశాలలకు ఈ నెల 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 9వ తేదీన తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సమాచారాన్ని కళాశాలల యాజమాన్యం, విద్యార్థులు గమనించాలని సూచించారు.
News September 23, 2025
పోలాకి: పిడుగుపడి మహిళ మృతి

పోలాకి మండలం ఉర్జాం గ్రామానికి చెందిన కణితి పద్మావతి (55) మంగళవారం పిడుగుపాటుకు గురై మృతి చెందారు. పొలంలో గాబు తీస్తున్న సమయంలో సమీపంలో పిడుగు పడడంతో మృతి చెందిందని మృతురాలు భర్త కృష్ణారావు తెలిపారు. మృతురాలికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పద్మావతి మృతితో గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
News September 23, 2025
SKLM: DSCలో ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య గమనిక

DSCలో ఎంపికైన అభ్యర్థులకు 25న విజయవాడలో సీఎం నియామక పత్రాలను అందజేయమన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం డీఈవో రవిబాబు ఓ ప్రకటన విడుదల చేశారు. 24న ఉదయం 6 గంటలకు, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్కు అభ్యర్థులు చేరుకోవాలని, 37 ప్రత్యేక బస్సుల్లో విజయవాడు చేరుకుంటారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.