News September 23, 2025
నస్పూర్: జాతీయ రహదారుల ఆర్బిట్రేషన్ కేసులపై సమీక్ష

మంచిర్యాల జిల్లాలో జాతీయ రహదారి 163జీ పరిధిలోని 3వ విడత ఆర్బిట్రేషన్ కోసం దాఖలు చేసిన 114 కేసులను పరిశీలిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారి 63కు సంబంధించి జిల్లాలోని 17 గ్రామాల్లో కోర్టు స్టే ఉన్న గ్రామాలను మినహాయించి మిగతా గ్రామాల్లో అవార్డు జారీ చేసినట్లు వివరించారు.
Similar News
News September 23, 2025
జూబ్లీహిల్స్ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

జూబ్లీహిల్స్ను అంతా కాస్ట్లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్లతో గ్రాండ్గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్నగర్, యూసుఫ్గూడ, సోమాజిగూడలోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.
News September 23, 2025
రబీ నుంచి ఆధార్పై ఎరువులు: అచ్చెన్నాయుడు

AP: వచ్చే రబీ సీజన్కు యూరియా సరఫరాలో ఎలాంటి కొరత ఉండదని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రబీ నుంచి ఆధార్ కార్డు ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఖరీఫ్ కోసం రాష్ట్ర అవసరాల మేరకు కేంద్రం నుంచి యూరియా తెప్పించామని, కొన్ని చోట్ల సరఫరాలో లోపాలు తలెత్తాయని, వాటిని సరిచేసుకొని ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది 1.23 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
News September 23, 2025
మైసూరులో ప్రారంభమైన దసరా ఉత్సవాలు

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైసూరు దసరా(నాడా హబ్బ) ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గ్రహీత, రచయిత్రి భాను ముష్తాక్, కర్ణాటక CM సిద్దరామయ్యతో కలిసి ఉత్సవాలు ప్రారంభించారు. చాముండేశ్వరి ఆలయంలో పుష్పవృష్టితో మొదలైన ఈ 11 రోజుల పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు ఉంటాయి. అక్టోబర్ 2న జంబో సవారితో ముగిసే ఈ వేడుకలు కర్ణాటక రాజవంశ వారసత్వాన్ని, ప్రగతిని ప్రదర్శిస్తాయి.