News April 5, 2024

‘2047 నాటికి 8శాతానికి జీడీపీ’.. తమ అంచనా కాదన్న IMF

image

భారత జీడీపీ 2047 నాటికి 8శాతానికి చేరుతుందన్న IMF ప్రతినిధి కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంచనాలపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు IMF భారత ప్రతినిధి హోదాలో చేసినవిగా వర్తిస్తాయని.. అది సంస్థ అభిప్రాయం కాదని స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై మరో రెండు వారాల్లో నివేదిక రిలీజ్ చేస్తామంది. కాగా గత పదేళ్లలో చేసినట్లు సంస్కరణలు కొనసాగిస్తే GDP 8శాతానికి చేరుతుందని కృష్ణమూర్తి పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు

image

సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.

News February 5, 2025

చికెన్ తినడానికి భయపడుతున్నారా?

image

APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.

News February 5, 2025

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!