News September 23, 2025
PDPL: ఒక్కో కార్మికుడికి రూ.1.95లక్షల BONUS!

సింగరేణి కార్మికులు 6నెలలుగా ఎదురుచూస్తున్న లాభాల వాటాను రూ.819 కోట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కో పర్మినెంట్ ఎంప్లాయ్ ఖాతాలో రూ.1.95లక్షల వరకు బోనస్ జమ కానుంది. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులూ నిరాశ చెందకుండా వారికీ ప్రభుత్వం రూ.17కోట్లను కేటాయించగా.. ఒక్కో కార్మికుడు రూ.5,500ల చొప్పున లబ్ధి పొందనున్నాడు. కాగా, దసరా, దీపావళి వేళ లాభాల ప్రకటనతో కార్మికుల కుటుంబాల్లో సంతోషం నెలకొంది.
Similar News
News September 23, 2025
ఐటీఐ అర్హతతో SJVNలో 87పోస్టులు

<
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14

1. రామాయణంలో ‘వాలి’ కుమారుడు ఎవరు?
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ఎవరు?
3. అత్రి మహాముని భార్య ఎవరు?
4. కామాఖ్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రీరామనవమి ఏ తెలుగు మాసంలో వస్తుంది?
– సమాధానాలు సాయంత్రం 6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>
News September 23, 2025
మండలి నుంచి వైసీపీ వాకౌట్

ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. అట్రాసిటీ కేసులపై చర్చ సందర్భంగా ‘మాపై గొడ్డలి వేటు, కోడికత్తి, అమ్మా, చెల్లి కేసులు లేవు’ అని హోం మంత్రి అనిత YCPపై సెటైర్లు వేశారు. దీంతో ఆమె వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామంటూ YCP ఎమ్మెల్సీలు బయటికి వెళ్లిపోయారు.