News September 23, 2025
దసరా సెలవుల్లో స్కూళ్లు మూసివేయాల్సిందే: డీఈవో

దసరా సెలవుల సందర్భంగా పాఠశాలలు తప్పనిసరిగా మూసివేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు ఆదేశించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు విధిగా అమలు చేయాలన్నారు. పాఠశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ ఆదేశాలను గౌరవించాలని కోరుతూ, ఎవరూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరాదని సూచించారు.
Similar News
News September 23, 2025
విజయవాడ: ప్రసాద తయారీని పరిశీలించిన కలెక్టర్

విజయవాడలోని దుర్గగుడిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ జి. లక్ష్మీశా మంగళవారం ప్రసాద తయారీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రసాదం అందించేందుకు నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత, శుభ్రత పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
News September 23, 2025
HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నాయా? అని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News September 23, 2025
HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నట్లు భయాందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.