News September 23, 2025
లక్కవరంలో ఇంటిలో చోరీ

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ ఇంటిలో దొంగలు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఉన్న రుక్కయ్య, లక్ష్మీకుమారిలపై దొంగలు దాడికి పాల్పడి నగదు, ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితులు ఫిర్యాదు చేయగా, డీఎస్పీ రవిచంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Similar News
News September 23, 2025
555 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలి: ఉత్తమ్

TG: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలోని ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధిక భూభాగంలో నది ప్రవహిస్తున్నందున 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
News September 23, 2025
వారికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్

AP: తల్లికి వందనం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేశ్ మండలిలో తెలిపారు. ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరినవారికి వెరిఫికేషన్ అనంతరం జమ చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్వాడీలకు కూడా పథకం వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
News September 23, 2025
MDK: రిజర్వేషన్ల వైపు వారి చూపు

స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతుండగా ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది. ఈరోజు సాయంత్రం వరకు రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.