News September 23, 2025

పైడితల్లమ్మ పండగ ఏర్పాట్లపై ఆరా

image

విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్.దామోదర్ మంగళవారం ఉదయం పర్యటించారు. వచ్చే నెల 6,7 తేదీల్లో పైడితల్లి అమ్మ వారి పండుగ జరగనున్న నేపథ్యంలో సిరిమాను ప్రారంభించే ప్రాంతమైన హుకుంపేటను పరిశీలించారు. అనంతరం పైడితల్లమ్మ అమ్మవారి గుడికి చేరుకుని భక్తులు లోపలికి ప్రవేశించే మార్గాలపై ఆరా తీశారు. వారితో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 24, 2025

VZM: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా ముందుండాలి’

image

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యాచరణ అమలు తీరును తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా MPDOలతో సమీక్షించారు. నగరపాలక సంస్థల్లో నిర్ణీత లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.

News September 23, 2025

VZM: ఆర్టీసీలో అప్రెంటీస్‌ షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్‌లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్‌లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్‌సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

News September 23, 2025

బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.