News September 23, 2025
ప్రజల సొమ్ముతో మీ నేతల విగ్రహాలా: సుప్రీం

TN ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. వల్లియూర్ డైలీ వెజిటబుల్ మార్కెట్ పబ్లిక్ ఆర్చ్ వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. ‘మీ నేతల విగ్రహాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగిస్తారా? ఇది ఆమోదయోగ్యం కాదు. అనుమతి కోసం కింది కోర్టుకే వెళ్లండి’ అని స్పష్టం చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో విగ్రహ ఏర్పాటును ఆ రాష్ట్ర హైకోర్టు అంతకుముందు తిరస్కరించింది.
Similar News
News September 23, 2025
డయాబెటిస్ లక్షణాలు ఇవే..

*బరువు తగ్గిపోవడం
*కంటిచూపు మందగించడం
*తరచూ పుండ్లు కావడం. గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం
*బాగా అలసిపోవడం
*అధికంగా దాహం వేయడం
*ఎక్కువసార్లు మూత్ర విసర్జన
>షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. కూరగాయాలు, పండ్లు, బీన్స్, ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలు తినాలి. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
Share It
News September 23, 2025
దక్షిణాదిలో జనాభా తగ్గిపోతోంది: చంద్రబాబు

AP: అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా తగ్గిపోతోందని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. ‘మన దేశంలో సగటు జీవిత కాలం 70 ఏళ్లుగా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతోంది. యూపీ, బిహార్ వల్లే ఆ లెక్కలు బ్యాలెన్స్ అవుతున్నాయి. వచ్చే ఏడాదికి రాష్ట్రంలో జనాభా 5.37 కోట్లకు చేరుకుంటుంది. WHO ప్రకారం మన రాష్ట్రంలోనే PHCలు, మెడికల్ ఆఫీసర్లు ఎక్కువగా ఉన్నారు’ అని తెలిపారు.
News September 23, 2025
ఈ సీజన్లో రూ.లక్ష కోట్ల బిజినెస్!

అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈకామర్స్ సైట్లలో ఇవాళ్టి నుంచి భారీ ఆఫర్లు మొదలయ్యాయి. దీంతో ఇండియాలోని ఈ సంస్థల ఆఫీసులు వార్ రూములను తలపిస్తున్నాయి. ఈ సీజన్లో ఏకంగా 25లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 1.2ట్రిలియన్ సేల్స్ జరుగుతాయని టెక్ నిపుణుల అంచనా. మొత్తం రూ.లక్ష కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుందని సమాచారం. అర్ధరాత్రి నుంచే సేల్స్ విపరీతంగా జరుగుతుండటం విశేషం.