News September 23, 2025
ఈ ఆహారంతో క్యాన్సర్ దరిచేరదు: వైద్యులు

పీచు పదార్థాలు నిండిన ఆహార పదార్థాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ‘పప్పులు, బీన్స్, చిరుధాన్యాలు, నట్స్, ఆకుకూరల్లో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు బ్యాక్టీరియాను పోషిస్తాయి. శరీరంలో వాపును తగ్గించే సమ్మేళనాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి. పీచు పేగులోని వ్యర్థాలను తొలగించి హానికర క్యాన్సర్ను నిరోధిస్తాయి. బరువు, రక్తంలోని చక్కెరను నియంత్రిస్తాయి’ అని సూచించారు.
Similar News
News September 23, 2025
ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రా. గోల్డ్ ధర రూ.2,700 పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,18,900కు చేరింది. అటు కేజీ వెండి ధర ఈ ఒక్కరోజే రూ.3,320 పెరిగి రూ.1,39,600 పలుకుతోంది.
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు
News September 23, 2025
మైథాలజీ క్విజ్ – 14 సమాధానాలు

1. రామాయణంలో వాలి కుమారుడు ‘అంగదుడు’.
2. వ్యాసుని ద్వారా దాసి కన్న బిడ్డ ‘విదురుడు’.
3. అత్రి మహాముని భార్య ‘అనసూయ’. ఈ దంపతుల కుమారుడే దత్తాత్రేయుడు.
4. కామాఖ్య దేవాలయం ‘అస్సాం’ రాష్ట్రంలో ఉంది.
5. శ్రీరామనవమి ‘చైత్ర మాసం’లో వస్తుంది.
<<-se>>#mythologyquiz<<>>