News September 23, 2025
RED ALERT: ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు

AP: రాబోయే 3-4 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పిడుగులు పడతాయని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Similar News
News September 23, 2025
డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.
News September 23, 2025
ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర

బంగారం ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రా. గోల్డ్ ధర రూ.2,700 పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,18,900కు చేరింది. అటు కేజీ వెండి ధర ఈ ఒక్కరోజే రూ.3,320 పెరిగి రూ.1,39,600 పలుకుతోంది.
News September 23, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

☛ తిరుమల శ్రీవారికి కానుకగా 535 గ్రాముల బంగారు అష్టలక్ష్మీ చంద్రవంక కంఠిని (విలువ రూ.60 లక్షలు) అందజేసిన BJP MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి
☛ రేపు HYD నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద BRS ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
☛ ‘గ్రూప్-1’ ఫలితాలు రద్దు చేయాలన్న తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలు.. తీర్పును కొట్టివేయాలని ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి విజ్ఞప్తి.. విచారణకు స్వీకరించిన కోర్టు