News September 23, 2025
గత ప్రభుత్వం 3,116 తప్పుడు కేసులు పెట్టింది: హోం మంత్రి

రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం3,116మందిపై తప్పుడు కేసులు పెట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై కేసులు పెట్టిన కారణంగా ఉద్యోగాలకు ఎంపికైన వారు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పర్యటించిన ప్రాంతాల్లో సంబంధిత నేతలను హౌస్ అరెస్ట్ చేసేవారని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడితే అరెస్ట్ చేసేవారన్నారు.
Similar News
News September 23, 2025
బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.
News September 23, 2025
హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

గాజులరామారంలో హైడ్రా యాక్షన్పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.
News September 23, 2025
డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.