News September 23, 2025

VJA: ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పుట్టిల్లు.. ధనకొండ

image

ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన దుర్గమ్మ ముందుగా మొగల్రాజపురంలో పాదం మోపి అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరారని ప్రతీతి. దీనికి ముందుగా దక్షిణాభి ముఖంగా మొగల్రాజపురం(ధనకొండ)లోని కొండపై ఒక చిన్న గుహలో శ్రీ చక్రపీఠం, పాదాలు, నేత్రాల రూపంలో కొలువుదీరారని భక్తులు చెబుతుంటారు. దసరా ఉత్సవాల్లో ప్రతి రోజు రాత్రివేళ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి నుంచి మొగల్రాజపురంలోని ధనకొండ ఆలయానికి చేరుకుంటారని భక్తుల విశ్వాసం.

Similar News

News September 23, 2025

బొండపల్లి: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

బొండపల్లి మండలంలో పిడుగుపాటుతో వ్యక్తి మృతి చెందాడు. MRO రాజేశ్వరరావు వివరాల ప్రకారం.. గంట్యాడ మండలం పెదమజ్జిపాలేనికి చెందిన సుంకరి సూర్యనారాయణ (63) వెదురువాడ గ్రామానికి సమీపంలోని మామిడి తోటలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఒక్కసారిగా పిడుగు పడడంతో సూర్యనారాయణ అక్కడిక్కడే మృతి చెందాడు. వీఆర్వో ద్వారా బొండపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు.

News September 23, 2025

హైడ్రా యాక్షన్.. ఎలా అయిందో చూడండి.!

image

గాజులరామారంలో హైడ్రా యాక్షన్‌పై అందరూ అభినందనలు తెలుపుతున్నారు. రూ.15 కోట్ల విలువైన 317 ఎకరాల స్థలాన్ని హైడ్రా కాపాడినట్లు తెలిపింది. వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. హైడ్రా చర్యలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడికి నేల కనిపిస్తోందని చెప్పారు.

News September 23, 2025

డిగ్రీ కోర్సుల్లో చేరికకు రేపే తుది గడువు

image

AP: వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడతలో సీట్లు పొందిన వారు బుధవారం లోగా కాలేజీల్లో చేరాలని OAMDC కన్వీనర్ కృష్ణమూర్తి తెలిపారు. విద్యార్థులు తమ అలాట్మెంట్ లెటర్లను డౌన్లోడ్ చేసుకొని కాలేజీల్లో రిపోర్టు చేయాలన్నారు. కాగా ఏపీలోని 1200 డిగ్రీ కాలేజీల్లో 3,82,038 సీట్లుండగా తొలివిడతలో 1,30,273 మందికి కేటాయించారు. 251765 సీట్లు మిగిలాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈనెల 26 నుంచి ప్రారంభమవుతుంది.