News September 23, 2025

నాంపల్లిలో రేపు జాబ్ మేళా

image

నాంపల్లి పరిధిలోని విజయనగర్ కాలనీలోని శాంతినగర్ గవర్నమెంట్ ఐటీఐ కళాశాల వద్ద ఉన్న ఎంప్లాయ్ మెంట్ కార్యాలయంలో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండి 25 ఏళ్ల లోపు వారై ఉండాలన్నారు. అభ్యర్థులు తగిన సర్టిఫికెట్లతో మేళాకు హాజరు కావచ్చని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి జయశ్రీ తెలిపారు. మరిన్ని వివరాలకు నంబర్ 8977175394ను సంప్రదించవచ్చు.

Similar News

News September 23, 2025

నార్సింగిలో ప్రేమ జంటపై దుండగుల దాడి

image

నార్సింగి పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కోకాపేట్ నియోపోలిస్ వద్ద ఒంటరిగా ఉన్న ఓ ప్రేమ జంటపై ఆరుగురు దుండగులు దాడికి పాల్పడ్డారు. వాళ్లను బెదిరించి బంగారు గొలుసు, మొబైల్, నగదు లాక్కొని బైక్స్‌పై పరారయ్యారు. ఈమేరకు బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

News September 23, 2025

HYD:’వ‌ర‌ద భ‌యం లేని న‌గ‌ర‌మే హైడ్రా ల‌క్ష్యం’

image

HYD నగరాన్ని వరదల నుంచి కాపాడడం, ప్రజలు ఏలాంటి భయం లేకుండా జీవించేలా చేయడం హైడ్రా ప్రధాన లక్ష్యం అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే నీట మునిగే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త నాలాలు, కాల్వలు నిర్మించడం, చెరువులను శుభ్రపరచడం, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు అమలు చేస్తోందన్నారు.

News September 23, 2025

HYD: బొనాంజా ఆఫర్.. నమ్మితే నట్టేట మునిగినట్టే!

image

దసరా పండుగను సైబర్ నేరగాళ్లు ‘క్యాష్’ చేసుకుంటున్నారు. బొనాంజా ఆఫర్ పేరుతో వాట్సప్, ఇన్‌‌స్టా, టెలిగ్రామ్‌లో లింక్‌లు పంపిస్తూ 75 నుంచి 100% డిస్కౌంట్ ఇస్తామని గాలం వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నాచారంలో వ్యక్తి ఈ గాలానికి చిక్కి రూ.18,987 పోగొట్టుకున్నాడు. అందుకే దసరా సందర్భంగా వచ్చే లింక్‌లను క్లిక్ చేయకపోవడం బెటర్.