News September 23, 2025

పాడేరు: మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలి

image

మ్యూటేషన్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సంతృప్తికరమైన సేవలు అందించి, పీజీఆర్ఎస్ ఫీడ్ బ్యాక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మంగళవారం పాడేరు కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. మ్యూటేషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న మ్యూటేషన్లకు సంబంధించి ప్రణాళికలు రూపొందించి, త్వరితగతిన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 23, 2025

ఈ ఫొటోలోని సెన్సేషనల్ డైరెక్టర్‌ని గుర్తు పట్టారా?

image

పై ఫొటోలో ఓ దిగ్గజ దర్శకుడు ఉన్నారు. డైరెక్టర్లు హీరోలను పరిచయం చేస్తే.. ఈయన టాలీవుడ్‌కు డైనమిక్ డైరెక్టర్లను అందించారు. యువ దర్శకులకు ఆయన మూవీ ఓ ప్రయోగశాల వంటిది. విజయాల నుంచి వివాదాల వరకు అన్నింటా ఆయనదే పైచేయి. ఆ సెన్సేషనల్ డైరెక్టరెవరో గుర్తుపట్టారా?
COMMENT.

News September 23, 2025

MBNR:PU.. సౌత్ జోన్ కబడ్డీ మహిళల జట్టు ఇదే..!

image

పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ కబడ్డీ మహిళల జట్టును ఎంపిక చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ VC జిఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్ర, జాతీయస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి పాలమూరు విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. మహిళా కబడ్డీ జట్టు:
1. పద్మ, 2.రాజేశ్వరి, 3.అనిత, 4.అనూష, 5.సరిత, 6.పార్వతి, 7.శిరీష, 8.కావేరి,9. సునేమా, 10.పూజ, 11.సునీత,12.కవిత,13.హిందూ,14. శ్రావణి,15.వాసంతి, 16.శ్రావణి

News September 23, 2025

ఖమ్మం: ఘోర ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

image

నేలకొండపల్లి మండలంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతనగర్ గ్రామం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.