News April 5, 2024
OTTలోకి వచ్చేసిన కామెడీ థ్రిల్లర్ ‘చారి 111’
వెన్నెల కిశోర్, సంయుక్త విశ్వనాథన్ జంటగా నటించిన స్పై యాక్షన్ కామెడీ థ్రిల్లర్ ‘చారి 111’ సడన్గా ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. మురళీ శర్మ, సత్య, తాగుబోతు రమేశ్ కీలక పాత్రల్లో నటించారు. హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేసిన నిందితులను హీరో ఎలా కనిపెట్టాడనే అంశంతో ఈ సినిమా తెరకెక్కింది.
Similar News
News February 5, 2025
దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!
TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 5, 2025
అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు
TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.
News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ
TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.