News September 23, 2025
అన్నమయ్య జిల్లాలో PAI 2.0 వర్క్షాప్ నిర్వహణ

అన్నమయ్య జిల్లా JC కలెక్టర్ అధ్యక్షతన PGRS హాల్లో పంచాయతీ పురోగతి సూచిక 2.0 పై మంగళవారం ఒకరోజు వర్క్షాప్ విజయవంతంగా నిర్వహించబడింది. జిల్లా, డివిజనల్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. వర్క్షాప్లో 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం గ్రామ పంచాయతీల పనితీరు పర్యవేక్షణ, డేటా ఆధారిత పాలన, వివిధ వనరులు మరియు భాగస్వామ్యాలను సమన్వయం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని అధికారులు తెలిపారు.
Similar News
News September 23, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

✓మాదకద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ జితేష్
✓ పత్తి కొనుగోలు పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ జితేష్
✓యూరియా కోసం లక్ష్మీదేవిపల్లిలో రైతుల రాస్తారోకో
✓వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు
✓అశ్వారావుపేట: 13 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్
✓భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
✓బూర్గంపాడు, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
News September 23, 2025
KNR: హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలించిన కలెక్టర్

వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నేషనల్ వైరల్ హైపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా హైపటైటిస్ వ్యాధిగ్రస్తుల నుండి వైద్యులు, సిబ్బందికి వ్యాధి ప్రబలకుండా ముందు జాగ్రత్తగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
News September 23, 2025
KNR: బాల సదన్, శిశు గృహాన్ని సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

పట్టణంలోని బాల సదన్, శిశు గ్రహాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ, సీనియర్ సివిల్ జడ్జ్ కే.వెంకటేష్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులతో ముచ్చటిస్తూ కష్టపడి చదువుకుని ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత సాధించాలని తెలియజేశారు. శిశు గృహాలలోని వంట, ఆహార పదార్థాలను నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పిల్లలు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శిశు గృహ లోని పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలపై శ్రద్ధ వహించాలని కోరారు.