News September 23, 2025
HYD:’వరద భయం లేని నగరమే హైడ్రా లక్ష్యం’

HYD నగరాన్ని వరదల నుంచి కాపాడడం, ప్రజలు ఏలాంటి భయం లేకుండా జీవించేలా చేయడం హైడ్రా ప్రధాన లక్ష్యం అని కమిషనర్ రంగనాథ్ అన్నారు. వర్షాకాలంలో కొద్దిపాటి వర్షానికే నీట మునిగే పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త నాలాలు, కాల్వలు నిర్మించడం, చెరువులను శుభ్రపరచడం, వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు అమలు చేస్తోందన్నారు.
Similar News
News September 24, 2025
HYD: ర్యాగింగ్ భూతం.. ఈనంబర్లు సేవ్ చేసుకోండి

ర్యాగింగ్ భూతానికి ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం నగరంలో చర్చనీయాంశమైంది. బీటెక్ విద్యార్థి ఇలా ప్రాణం తీసుకోవడం బాధాకరమని, ఇలాంటి ఘటనపై విద్యార్థులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని విద్యార్థులు 100, 040-23286966, 8712681251, 040-27853418, 9490617100, 040-27852333, 8712661000, 040-27853030, 8712662666 నంబర్లకు ఫోన్ చేసి సాహాయం పొందవచ్చని సూచించారు.
News September 24, 2025
సైబరాబాద్ కమిషనరేట్లో పోలీసులకు మెడల్స్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆడిటోరియంలో 122 పోలీస్ సిబ్బందికి సేవా పథకం మెడల్స్ అందజేశారు. ఈ అవార్డుల్లో 35 మెడల్స్ కొత్త సంవత్సరం, 87 మెడల్స్ తెలంగాణ స్థాపన దినోత్సవం సందర్భంగా ఇచ్చారు. సైబరాబాద్ CP అవినాష్ మోహంతి అవార్డులను అందజేసి అభినందించారు. ఈ అవార్డులు సిబ్బందికి కృషి, ప్రజా భద్రతలో అంకితభావాన్ని ప్రతిబింబిస్తాయని చెప్పారు. జాయింట్ CP ట్రాఫిక్, ADCPs, ACPs, ఇన్స్పెక్టర్లు ఉన్నారు.
News September 23, 2025
HYD: పిజ్జా ఔట్లెట్లపై అధికారుల దాడులు

రాష్ట్రవ్యాప్తంగా 55 పిజ్జా ఔట్లెట్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో 18 పిజ్జాహట్, 16 డొమినోస్, 21 ఇతర కేంద్రాలు ఉన్నాయి. తనిఖీల్లో కిచెన్లలో అపరిశుభ్రత, వెజ్, నాన్వెజ్ వస్తువులను ఒకేచోట నిల్వ ఉంచడం వంటి నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు.