News April 5, 2024
పోలవరం, గోపాలపురం టికెట్లపై టీడీపీ శ్రేణుల ఆందోళన
AP: టీడీపీ అధినేత చంద్రబాబు నల్లజర్ల(తూర్పుగోదావరి జిల్లా) పర్యటనలో గందరగోళం ఏర్పడింది. పోలవరం, గోపాలపురం అసంతృప్త నేతలు, కార్యకర్తలు CBN కాన్వాయ్ను అడ్డుకున్నారు. జనసేన నేత చిర్రి బాలరాజుకు పోలవరం టికెట్ ఇవ్వొద్దని బొరగం శ్రీనివాస్(TDP) వర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గోపాలపురంలో మద్దిరాజు వెంకటరాజు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ బాపిరాజు వర్గీయులు నినాదాలు చేశారు.
Similar News
News February 5, 2025
శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు ఆందోళన
హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి ఈరోజు తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయింది. అప్పటి నుంచీ విమానం కోసం ఎయిర్పోర్టులో పడిగాపులు గాస్తున్న ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఇంకా రాలేదని, కనీసం సరైన సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా లేవని మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన సమయం దాటిపోతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News February 5, 2025
Stock Markets: నెగటివ్ సంకేతాలొచ్చినా లాభాల్లోనే..
దేశీయ స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 23,779 ( +40), సెన్సెక్స్ 78,609 (+33) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలే అందినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. మీడియా, మెటల్, బ్యాంకు, ఫైనాన్స్, O&G షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. BPCL, INDUSIND BANK, ONGC, HINDALCO, SHRIRAM FIN టాప్ గెయినర్స్. ASIANPAINT, NESTLE, TITAN, EICHER టాప్ లూజర్స్.
News February 5, 2025
ఓటీటీలోకి వచ్చేసిన కీర్తి సురేశ్ మూవీ
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 14లోపు ఫ్రీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రానుందని సమాచారం. వరుణ్ ధావన్, కీర్తి, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఇది విజయ్ ‘తేరీ’(పోలీసోడు) సినిమాకు రీమేక్గా తెరకెక్కింది.