News September 23, 2025

ఒక్కరోజే రూ.2,700 పెరిగిన బంగారం ధర

image

బంగారం ధరలు రికార్డులు బద్దలుకొడుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 10 గ్రా. గోల్డ్ ధర రూ.2,700 పెరిగింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రా. పసిడి ధర రూ.1,18,900కు చేరింది. అటు కేజీ వెండి ధర ఈ ఒక్కరోజే రూ.3,320 పెరిగి రూ.1,39,600 పలుకుతోంది.

Similar News

News September 24, 2025

ఆరోగ్య సమస్యలు.. అవసరమైన విటమిన్లు

image

* అలసటగా ఉంటే విటమిన్ B12, *రోగనిరోధక శక్తి కోసం విటమిన్ C, * జుట్టు పలచబడితే బయోటిన్ (B7), * పొడి చర్మం ఉంటే విటమిన్ E, *తరచుగా జలుబు వస్తుంటే విటమిన్ D, *కండరాల తిమ్మిరి అనిపిస్తే మెగ్నీషియం + విటమిన్ D, *రాత్రి సరిగా కనిపించకపోతే విటమిన్ A, *గాయాలు నెమ్మదిగా మానితే విటమిన్ C + జింక్, *మూడ్ స్వింగ్స్ / ఆందోళనగా ఉంటే విటమిన్ B6 + మెగ్నీషియం, *కీళ్ల దృఢత్వానికి విటమిన్ D + K2. SHARE IT

News September 24, 2025

రేపు విజయవాడకు ఉపరాష్ట్రపతి రాక

image

AP: వైస్ ప్రెసిడెంట్ C.P రాధాకృష్ణన్, ఆయన సతీమణి సుమతి బుధవారం మధ్యాహ్నం విజయవాడకు రానున్నారు. విమానాశ్రయంలో CM చంద్రబాబు వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుంటారు. సాయంత్రం జరిగే విజయవాడ ఉత్సవ్‌లో చీఫ్ గెస్టుగా పాల్గొంటారు. అనంతరం IAF ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

News September 24, 2025

క్రికెట్ నుంచి బ్రేక్.. శ్రేయస్‌ నిర్ణయం?

image

టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ రెడ్ బాల్ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని డిసైడైనట్లు తెలుస్తోంది. వెన్ను నొప్పి కారణంతో తాను లాంగెస్ట్ ఫార్మాట్‌కు కొన్ని రోజులు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన బీసీసీఐకి లేఖ రాసినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అయ్యర్ లేదా బీసీసీఐ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ఆస్ట్రేలియా-Aతో ఈరోజు ప్రారంభమైన రెండో అన్‌అఫీషియల్ టెస్టుకూ శ్రేయస్ దూరమయ్యారు.