News September 23, 2025
పెరవలిలో రోడ్డు ప్రమాదం

తూ.గో జిల్లా పెరవలి మండలం తీపర్రు పరిధిలో మంగళవారం RTC బస్సు ప్రమాదానికి గురైంది. స్థానికుల వివరాల మేరకు.. తణుకు డిపోనకు చెందిన బస్సు రాజమండ్రి వెళ్తుండగా అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ (50) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News September 24, 2025
డీఎస్సీ-2025 అభ్యర్థుల ప్రయాణ ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

డీఎస్సీ–2025లో ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు విజయవాడ ప్రయాణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొనే అభ్యర్థుల కోసం రాజమండ్రిలో ఆరు పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎంపికైన అభ్యర్థులు గురువారం తమకు కేటాయించిన పాఠశాలల వద్దకు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా రావాలని సూచించారు.
News September 23, 2025
కడియం: అమ్మవారికి 95 కిలోల లడ్డూ

కడియం శ్రీదేవి చౌక్ సెంటర్లో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, అదే గ్రామానికి చెందిన ఎన్.నానాజీ అమ్మవారికి లడ్డూ సమర్పించారు. 95 కిలోల భారీ లడ్డూను మంగళవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సమర్పించారు. ఈ లడ్డూను 10 రోజులపాటు అమ్మవారి వద్ద ఉంచుతామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.
News September 23, 2025
ఆక్వా చెరువులకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి: కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు అందరూ APSADA Act – 2020 ప్రకారం తమ చేపల చెరువులను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ నెల 15వ తేదీ లోపు లైసెన్సులు పొందాలని ఆమె స్పష్టం చేశారు. సోమవారం రాజమండ్రిలోని కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశించారు.