News September 23, 2025
KNR: ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల విదేశీ స్కాలర్షిప్

విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్-గ్రాడ్యుయేట్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా రూ.20 లక్షల స్కాలర్షిప్ అందించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 19లోగా www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నగైలేశ్వర్ తెలిపారు.
Similar News
News September 24, 2025
కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

ఉక్రెయిన్తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.
News September 24, 2025
మైలార్దేవ్పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

మైలార్దేవ్పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్ అమీర్, మహమ్మద్ సోయల్ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.
News September 24, 2025
జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.