News September 23, 2025

సీతంపేట: ‘రహదారుల నిర్మాణంలో డోలి గ్రామాలకే తొలి ప్రాధాన్యత’

image

ఐటీడీఏ ద్వారా చేపడుతున్న రహదారి నిర్మాణంలో డోలి గ్రామాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పార్వతీపురం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీఏ సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులను కచ్చితంగా ఇంటర్మీడియట్ కళాశాలలో చేర్పించాలని సూచించారు. వసతి గృహాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు.

Similar News

News September 24, 2025

కాగితంపై పులిలా రష్యా.. ట్రంప్ కవ్వింపు

image

ఉక్రెయిన్‌తో మూడున్నరేళ్లుగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా కాగితంపై పులిలా వ్యవహరిస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. EU సహకారంతో రష్యా నుంచి భూభాగాన్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, చర్యలు తీసుకునేందుకు ఉక్రెయిన్‌కు ఇదే సరైన సమయమన్నారు. నాటో దేశాలకు ఆయుధాల సరఫరాను కొనసాగిస్తామని ట్రంప్ పేర్కొన్నారు.

News September 24, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

image

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్‌ అమీర్‌, మహమ్మద్‌ సోయల్‌ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

News September 24, 2025

జనగామ: 76 వేల మందికి రూ.500లకే వంట గ్యాస్..!

image

నానాటికి పెరుగుతున్న ధరల ప్రభావం పేద ప్రజలపై పడకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద రూ.500లకే వంట గ్యాస్ సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా జనగామ జిల్లాలో ఇప్పటివరకు 76,430 మంది వినియోగదారులకు 500లకే వంట గ్యాస్ సరఫరా చేశారు. కొత్త రేషన్ కార్డులు వచ్చిన నేపథ్యంలో వినియోగదారులు మరింత పెరిగే అవకాశం ఉంది.