News September 24, 2025

ఎర్రచందనం స్మగ్లరుకు 5 ఏళ్ల జైలు, రూ.6 లక్షల జరిమానా

image

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన అండీకి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6లక్షల జరిమానా విధించారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో కేసు విచారణ జరిపి నేరం రుజువుకావడంతో ఈ తీర్పు వెలువడింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం నరికే నేరస్తులకు ఇది హెచ్చరికగా నిలుస్తుందని టాస్క్‌ఫోర్స్ ఎస్పీ అన్నారు.

Similar News

News September 24, 2025

అలర్ట్.. ఎల్లుండి నుంచి అతి భారీ వర్షాలు

image

TG: అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. రేపు ఉ.8.30లోపు వికారాబాద్, సంగారెడ్డి, MBNR, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 26 నుంచి రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News September 24, 2025

ఆసియా కప్: గెలిస్తే ఫైనల్‌కే

image

ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచులో గెలిస్తే సూర్య సేన ఫైనల్ చేరనుంది. ఒకవేళ ఓడితే శ్రీలంకతో మ్యాచులో మెరుగైన RRతో గెలవాలి. బంగ్లాతో ఇప్పటివరకు 17 T20Iలు ఆడగా 16 మ్యాచుల్లో IND విజయం సాధించింది. అటు శ్రీలంకపై విజయంతో బంగ్లా జోరు మీద ఉంది. దుబాయ్ వేదికగా రా.8 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు.

News September 24, 2025

టన్ను ఇసుక రూ. 1,100 కే విక్రయం: కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరలో ఇసుక అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. గోదావరి ఇసుకను టన్నుకు రూ. 1,100 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. కూసుమంచి, మధిర, సత్తుపల్లి, కామేపల్లి, ఖమ్మంలో ఈ ఇసుక బజార్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఐదు బజార్లలో మొత్తం 5,194 మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచామని తెలిపారు.