News September 24, 2025

మైలార్‌దేవ్‌పల్లిలో సుపారీ గ్యాంగ్ అరెస్ట్

image

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సుపారీ గ్యాంగ్‌ను అరెస్టు చేశారు. రూ. 9 లక్షలకు ఇమ్రాన్‌ను హత్య చేయడానికి ముగ్గురు వ్యక్తులు సుపారీ తీసుకున్నారు. గత వ్యాపార వివాదాల కారణంగా షేక్‌ అమీర్‌, మహమ్మద్‌ సోయల్‌ ఈ సుపారీ ఇచ్చారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి కత్తులు, సెల్‌ఫోన్లు, వాహనాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News September 24, 2025

HYD: మూసీ వద్ద మహిళ మృతదేహం.. ముగ్గురి అరెస్ట్

image

మూసీ నది వద్ద లభ్యమైన మహిళా మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. మహిళను అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. దుర్గారెడ్డి, గులామ్ దస్తగిర్ ఖాన్, మొహమ్మద్ ఇమ్రాన్‌లను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇద్దరు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసి, కర్రలతో హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.

News September 24, 2025

కూకట్‌పల్లిలో ఇంట్లోకి వెళ్లి దాడి.. అక్రమ సంబంధమే కారణమా !

image

కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లో ముసుగులు ధరించిన ఇద్దరు ఇంట్లోకి చొరబడి భూపాల్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో తన భార్య చంద్రకళ వివాహేతర సంబంధంపై భూపాల్ అనుమానం వ్యక్తం చేశారు. 5ఏళ్ల క్రితం తమ పెళ్లి జరగ్గా, ప్రస్తుతం ఆమె మరో వ్యక్తితో వివహేతర సంబంధం ఉందని, ఆ విషయమై గొడవ జరగడంతో దుర్గయ్య అనే వ్యక్తితో కలిసి ఆమె దాడి చేయించిందని భూపాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 24, 2025

హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు

image

నాలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులు అందాయి. నాలాల కబ్జా కారణంగా వర్షం నీరు ఇళ్లలోకి చేరుతోందని ఫిర్యాదు చేశారు. చెరువులను కలిపే నాలాలు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లడం లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. చెరువుల‌ను అనుసంధానం చేస్తూ సాగే నాలాలు క‌బ్జాల‌కు గురి కావడంతో వ‌ర‌ద నేరుగా చెరువుకు వెళ్ల‌కుండా కాల‌నీల్లోకి వస్తుందని పేర్కొన్నారు.