News September 24, 2025
భీమవరంలో మిస్సింగ్.. గుంటూరులో ప్రత్యక్షం

భీమవరానికి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి పారిపోవడంతో పోలీసులు గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. భవాని దీక్షకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అందిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. బాలుడు అమరావతిలోని మేనమామ ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో గుంటూరు రైల్వే చైల్డ్ కేర్కు సమాచారం ఇచ్చారు. వారు బాలుడిని గుంటూరులో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Similar News
News September 24, 2025
మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత: కలెక్టర్

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి, అవసరమైన మేరకు వెంటనే నిర్మాణాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. 2023 – 24, 2025 – 2026 సంవత్సరాల్లో 1,550 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 915 పూర్తి చేయడం జరిగిందని, 103 నిర్మాణాల్లో ఉన్నాయని, ఇంకా 532 ఇంకా ప్రారంభించాల్సి ఉందన్నారు.
News September 24, 2025
నేడు పాలకొల్లు రానున్న సీఎం చంద్రబాబు

పాలకొల్లులో బుధవారం నిర్వహించనున్న మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె శ్రీజ వివాహానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ఉండవల్లిలో తన నివాసం నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరతారు. 1:15 నిమిషాలకు పాలకొల్లు రానున్నారు. 1:30 నుంచి 2:15 వరకు పెళ్లి వేడుకలో పాల్గొననున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు.
News September 23, 2025
గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలి: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, గర్భిణులు, బాలింతలు, పిల్లల ఆరోగ్య అంశాలపై మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలు, పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.