News September 24, 2025
ఆదిలాబాద్: మమ్మల్ని అనాథలను చేయకండి..!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలు కలకలం సృష్టిస్తున్నాయి. గొడవలతో వివాహితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సోమవారం కాగజ్నగర్లో ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి సూసైడ్ చేసుకోగా.. ఇటీవల జైనథ్ మండలానికి చెందిన మరో వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలతో పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అఘాయిత్యాలకు పాల్పడకండి.
Similar News
News September 24, 2025
MDK: రా’జీవం’ లేని యువ వికాసం

రాజీవ్ యువ వికాస పథకం నేటికి అమలుకు నోచుకోలేదు. ఆశావహులు దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా పురోగతి లేదు. ఇప్పుడిస్తాం.. అప్పడిస్తామంటూ ఆశ పెట్టి తమను ఆగం చేశారని లబ్ధిదారులు వాపోతున్నారు. పైగా నెలాఖరులోగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ప్రచారం. ఈ లోగా రుణాలిచ్చి ఉపాధికి మార్గం చూపాలని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో 32,638 మంది దరఖాస్తు చేసుకున్నారు.
News September 24, 2025
5 రాజ్యసభ స్థానాలకు ఈసీ షెడ్యూల్ విడుదల

జమ్మూకశ్మీర్, పంజాబ్లో ఖాళీగా ఉన్న 5 రాజ్యసభ స్థానాలకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూకశ్మీర్లో 4, పంజాబ్లో ఒక సీటు(ఉపఎన్నిక) ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 6న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. 13 వరకు నామినేషన్ల స్వీకరణ, 14న పరిశీలన, 16న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఓట్లు లెక్కింపు ప్రారంభం అవుతుంది.
News September 24, 2025
WGL: ఆక్సిజన్ అందక MGMలో పసికందు మృతి

వరంగల్ MGM ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక రెండు నెలల పసికందు మృతి చెందింది. ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆక్సిజన్ అందక శిశివు మృతి చెందినట్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఓ కుటుంబం శిశువును 3 రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకురాగా నేడు మృత్యువాత పడింది. ఆసుపత్రి నిర్వహణ లోపం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.