News September 24, 2025
మరుగున పడుతున్న సాంప్రదాయ ఆకుకూరల సాగు

ఒకప్పుడు ప్రాంతాలను బట్టి అనేక రకాల ఆకుకూరలను ఉపయోగించేవారు. ఉదాహరణకు రాయలసీమలో పప్పాకు, ఎర్రబద్దాకు, పొనగంటాకు, బచ్చలాకు, చెంచలాకు, అవిసాకు, మునగాకు, కాంచి ఆకు, అటుకు మామిడి ఆకు, చింతాకు, గురుగాకు మొదలైనవి ఆకుకూరలుగా ఉపయోగిస్తారు. వీటితో తయారుచేసిన వంటలు అధిక పోషకాలు కలిగి మంచి వాసన, రుచి ఉండేవి. తరాలు మారుతుండటం, ఆసక్తి తగ్గడంతో ఇలాంటి ఆకుకూరల్లో కొన్నింటి సాగు, వినియోగం తగ్గింది.
Similar News
News September 24, 2025
BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
News September 24, 2025
OG మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

TG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన OG చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గం.కు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.
News September 24, 2025
సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి: నాని

AP: జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ‘వైఎస్ జగన్కు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలి. ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఇవ్వకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించాం’ అని తాడేపల్లిలో తెలిపారు. కాగా జగన్ అధ్యక్షతన ఇవాళ తాడేపల్లిలో YCP విస్తృతస్థాయి సమావేశం జరుగుతోంది.