News September 24, 2025

ఇళ్లను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని కలెక్టర్

image

పేదల ఇళ్ల గృహ నిర్మాణాలను నిర్దేశించిన సమయంలోగా నిర్మించాలని కలెక్టర్ వెట్రిసెల్వి గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస యోజన పధకం-1.O కింద పేదల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై కలెక్టరేట్ నుంచి మంగళవారం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లాకు కేటాయించిన 12 వేల 345 ఇళ్ల నిర్మాణ లక్ష్యానికి గాను, 10 వేల 240 ఇళ్లు పూర్తి చేయగా మిగిలిన 2105 వెంటనే పూర్తి చేయాలన్నారు.

Similar News

News September 24, 2025

BREAKING: రైల్వే ఉద్యోగులకు పండగ బోనస్

image

రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 78 రోజుల ఉత్పత్తి ఆధారిత బోనస్‌ ప్రకటించింది. ఈ మేరకు నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.1,866 కోట్లను ఇవ్వనుంది. దీంతో ఆ కేటగిరిలోని ఒక్కో ఉద్యోగికి రూ.17,951 వరకు అందనుంది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో 10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

News September 24, 2025

OG మూవీకి హైకోర్టులో ఎదురుదెబ్బ

image

TG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబోలో తెరకెక్కిన OG చిత్రానికి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా బెనిఫిట్ షో, టికెట్ రేట్లు పెంచుతూ జారీ చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 10 గం.కు ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్, ఇప్పటికే కొనుగోలు చేసిన టికెట్లపై సందిగ్ధం నెలకొంది.

News September 24, 2025

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు

image

విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అంబేద్కర్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీకి కోరారు. ADE దాదాపు రూ.100 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ గుర్తించింది. అంబేద్కర్ బినామీ ఇంట్లో గుర్తించిన రూ.2 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.