News September 24, 2025

చందమామ కథలను ప్రారంభించింది మన తెనాలి వారే

image

తెలుగు రచయిత, ‘చందమామ’ పుస్తక సంపాదకుడు, చందమామ-విజయా కంబైన్స్ సహా నిర్మాత ఆలూరు వెంకట సుబ్బారావు (కలంపేరు చక్రపాణి) తెనాలిలో జన్మించారు. ఆయన రచయితగా, అనువాదకుడిగా పేరు పొందడంతో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమాలే కాక ఆయన నాగిరెడ్డితో కలసి 1947 జులైలో పిల్లల కోసం చందమామ కథల పుస్తకం ప్రారంభించారు. భారతీయుల్లో చదవడం వచ్చిన ప్రతి ఒక్కరూ చందమామ ఒక్కసారైనా చదివే ఉంటారనడంలో అతిశయోక్తి లేదు.

Similar News

News September 24, 2025

ఉమ్మడి జిల్లాలో ఆస్తి పన్ను పెంపు లక్ష్యం

image

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మున్సిపాల్టీల ఆస్తి పన్ను ఆదాయం రూ.258.95 కోట్లు ఉండగా, దీనిపై 20శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించింది. దీంతో రూ.52 కోట్లు అదనంగా రాబట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇంటింటి సర్వేలు ప్రారంభమయ్యాయి. గతంలో జరిగిన అక్రమాలు, తప్పు కొలతల కారణంగా పన్ను నష్టం వాటిల్లిందని గుర్తించిన అధికారులు, ఈసారి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నారు.

News September 24, 2025

GNT: ప్రైవేట్ ఐటీఐ ఖాళీల భర్తీ ప్రక్రియ

image

గుంటూరు జిల్లా ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో ఖాళీ సీట్ల భర్తీకి కొత్త నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని అధికారులు తెలిపారు. తరువాత సర్టిఫికెట్ల ధృవీకరణ తెనాలి, గుంటూరులోని ప్రభుత్వ ఐటీఐల్లో జరుగుతుందన్నారు. 29న తెనాలి ప్రభుత్వ ఐటీఐలో, 30న ప్రైవేట్ కళాశాలల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

News September 24, 2025

GNT: జాతీయ రహదారి 167 కోసం భూమి సేకరణ

image

కొండమోడు-పేరేచర్ల జాతీయ రహదారి 167AG నిర్మాణానికి కేంద్రం భూసేకరణ అనుమతి ఇచ్చింది. మేడికొండూరు మండలం కొర్రపాడు, మేడికొండూరు, మంగళగిరిపాడు, ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామాల్లో 63 మంది యజమానుల నుంచి 14.82 హెక్టార్ల భూమిని సేకరిస్తారు. రోడ్డు రవాణా శాఖ ప్రకటన ప్రకారం, ఈ భూసేకరణ రహదారి నిర్మాణంలో కీలకమైన దశ. భూమి సేకరణ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.