News September 24, 2025

కేయూలో LLB 3, 5 మొదటి సెమిస్టర్ పరీక్షలు..!

image

కేయూలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 8, 10, 14, 16, 18వ తేదీల్లో మ.2 గంటల నుంచి సా.5 వరకు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. అక్టోబరు 9, 13, 15, 17వ తేదీల్లో ఉ.10 నుంచి మ. ఒంటి గంట వరకు ఎల్ఎల్బీ ఐదేళ్ల కోర్సు మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, ఇతర వివరాలకు కేయూ వెబ్ సైట్లో చూడాలని సూచించారు.

Similar News

News September 24, 2025

MHBD: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు

image

MHBD జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారిగా శ్రీనివాసరావు బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడిగా (ED) ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలో జిల్లా మైనార్టీ సంక్షేమ, గిరిజన సంక్షేమ, యువజన, క్రీడల, డోర్నకల్ మున్సిపల్ కమిషనర్‌గా మొదలు ఉన్నత హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వహించారు.

News September 24, 2025

విమానం టైర్ల వద్ద కూర్చొని ప్రయాణించింది ఇతడే

image

కాబూల్ (AFG)నుంచి ఢిల్లీ వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ప్రయాణించిన 13ఏళ్ల బాలుడి ఫొటో బయటకొచ్చింది. ఇరాన్‌కు పారిపోయేందుకు అతను ఢిల్లీకి వెళ్లే RQ4401 విమానం టైర్ భాగంలో <<17798595>>కూర్చొని<<>> ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. అతను తనతో పాటు ఓ చిన్న ఆడియో స్పీకర్‌ను తెచ్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా ప్రయాణిస్తే ఎలా ఉంటుందనే క్యూరియాసిటీతోనే టైర్ల వద్ద కూర్చున్నట్లు పిల్లాడు తెలిపాడు.

News September 24, 2025

స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: DMHO

image

ఆస్పత్రులలో నిర్వహించే స్కానింగ్ సెంటర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాలని DMHO డాక్టర్ మధుసూదన్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలో జిల్లా మెడికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. జిల్లాలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న స్కానింగ్ సెంటర్లతో పాటు ఇప్పటికే ఉన్న స్కానింగ్ సెంటర్లకు అనుమతి గురించి అడ్వైజర్ కమిటీ ముందు ఉంచామన్నారు.