News September 24, 2025
జోగులాంబ రైల్వే హాల్ట్ దగ్గర ప్రతి రైలు ఆగాలని ఎంపీకి వినతి

ఆలంపూర్లోని ఐదో శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే హాల్ట్ వద్ద ప్రతి రైలు ఆగేలా చూడాలని ఆలయ పాలకమండలి కమిటీ సభ్యులు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా, ఈ మార్గం గుండా వెళ్లే ఒక రైలుకు ‘జోగులాంబ ఎక్స్ప్రెస్’ అని నామకరణం చేయాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని ఆమెకు సమర్పించారు.
Similar News
News September 24, 2025
KMR: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి పి.వెంకటేష్ తెలిపారు. డిగ్రీలో 60% మార్కులు సాధించిన విద్యార్థులు నవంబర్ 19, 2025 లోపు http://www.Telangana epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
News September 24, 2025
PU.. సౌత్ జోన్ ఆర్చరి జట్టు ఎంపిక

పాలమూరు యూనివర్సిటీలో ఆర్చరి పురుషుల విభాగంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బుధవారం ఎంపికలు నిర్వహించామని యూనివర్సిటీ పీడీ.వై.శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ ఉపకులపతి(VC) జి ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు మాట్లాడుతూ.. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
News September 24, 2025
పోలవరం ఎడమ కాలువ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి: కలెక్టర్

పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ బుధవారం అధికారులను ఆదేశించారు. పాయకరావుపేట వద్ద జరుగుతున్న పనులను ఆమె పరిశీలించారు. చేయాల్సిన పని, కాల పరిమితి, కార్యాచరణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 21.77 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకం పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 11.25 లక్షల క్యూబిక్ మీటర్ల తవ్వకాలు జరిగాయన్నారు.