News September 24, 2025
పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారు: హరీశ్

TG: కృష్ణా జలాల వాటాలో CM రేవంత్, మంత్రి ఉత్తమ్ పూటకో మాట మాట్లాడి రాష్ట్రం పరువు తీస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. వీళ్ల అజ్ఞానం వల్ల నీటి వాటాను కోల్పోయే పరిస్థితి వచ్చిందని ట్వీట్ చేశారు. 763 TMCలు ఇవ్వాలంటూ KCR గతంలో పట్టుబట్టారని గుర్తుచేశారు. CBNకు భయపడి బనకచర్లపై మౌనం వహించిన రేవంత్, ఇప్పుడు కర్ణాటకలోని INC ప్రభుత్వం కోసం ఆల్మట్టి ఎత్తు పెంపుపై మాట్లాడటం లేదని దుయ్యబట్టారు.
Similar News
News September 24, 2025
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <
News September 24, 2025
మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు