News September 24, 2025

ప్రకాశం జిల్లాలోని 8, 10 తరగతుల విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల 2026-27 అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శివరాం బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లా పరిధిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 8, 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అక్టోబర్ 7వ తేదీలోగా దరఖాస్తులను ఆఫ్లైన్, ఆన్‌లైన్ పద్ధతిలో ఇవ్వాలని సూచించారు.

Similar News

News September 27, 2025

ప్రకాశం: విద్యుత్ వినియోగదారులకు SE కీలక సూచన

image

జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు SE వెంకటేశ్వర్లు శనివారం కీలక సూచన చేశారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించే కౌంటర్లు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే 30వ తేదీ కూడా సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని ఆయన విద్యుత్ వినియోగదారులకు సూచించారు. ఈ విషయాన్ని గమనించి విద్యుత్ బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.

News September 27, 2025

ప్రకాశంలో పర్యాటక అందాలు ఎన్నో ఎన్నెన్నో..!

image

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ప్రకాశం జిల్లాలో పర్యాటక ప్రదేశాల జాబితా కోకొల్లలు. ఇటు ఆధ్యాత్మిక, అటు ప్రకృతి హొయలు గల పర్యాటక ప్రదేశాలు జిల్లాలో ఉన్నాయి. భైరవకోన, త్రిపురాంతకేశ్వర ఆలయం, రాచర్ల నెమలిగుండ్ల రంగనాయకస్వామి, మాలకొండ, సింగరాయకొండ నరసింహస్వామి క్షేత్రం వంటి ఆలయాలు ఉన్నాయి. కొత్తపట్నం, పాకల బీచ్‌లు, మైలవరం డ్యాం, నల్లమల అడవుల అందాలు ఎన్నో. మరి ఈ దసరాకు మీరు ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు.

News September 27, 2025

ప్రకాశం: ‘ఒకరికి ఒక్క ఓటే ఉండాలి’

image

ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు ఒక ఓటు మాత్రమే కలిగి ఉండాలని DRO చిన్న ఓబులేసు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గల డిఆర్వో ఛాంబర్‌లో శుక్రవారం గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాట్లాడుతూ.. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోనివారు, వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. 18ఏళ్ళు నిండిన యువత ఓట్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.