News September 24, 2025
SKLM: మీ ప్రతిభతో ప్రధాని మోదీని కలవచ్చు

కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘యువ నాయకులు (క్వీజ్) ప్రసంగ పోటీలు’ జరగనున్నాయి. వీటికి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ విద్యార్థులు అర్హులని మేర యువ భారత్ డిప్యూటీ డైరక్టర్ వెంకట్ ఉజ్వల్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలవారు https://www.MYBharat.gov.in వెబ్సైట్లో అక్టోబర్ 30లోగా నమోదు చేయాలన్నారు. ఎంపికైన వారు ప్రధాని మోదీని కలవచ్చునన్నారు.
Similar News
News September 27, 2025
నరసన్నపేట: గడ్డి మందు తాగి ఒకరు మృతి

నరసన్నపేట మండలం కంబకాయ గ్రామానికి చెందిన కెల్ల రాజారావు గడ్డి మందుతాగి శనివారం మరణించారు. కుటుంబ కలహాలు కారణంగా మనస్తాపం చెందిన రాజారావు 26న సాయంత్రం గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న రాజారావును కుటుంబ సభ్యులు నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రిమ్స్లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతు మృతి చెందాడు. భార్య రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News September 27, 2025
జి. సిగడాం: రైలు ప్రమాదంలో ఒకరు మృతి

రైలు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన జి. సిగడాంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. మృతదేహం రైల్వే స్టేషన్ సిగ్నల్ పాయింట్ వద్ద పడి ఉండగా స్థానికుల సమాచారంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ మధుసూదన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి (23) ఏళ్లు ఉంటాయని, ఆరెంజ్ కలర్ చొక్కా ధరించాడని తెలిపారు. వివరాలు తెలిసిన వారు 91103 05494 నంబర్కు సంప్రదించాలని హెడ్ కానిస్టేబుల్ చెప్పారు.
News September 27, 2025
వైసీపీ డిజిటల్ బుక్ లాంచింగ్ చేసిన తమ్మినేని

వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరుగుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ బుక్ లాంచింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ నాయకులపై చేస్తున్న అక్రమాలపై బుక్లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.