News September 24, 2025

తిరుపతిలో నిజామాబాద్ యువకుడి హత్య..?

image

తిరుపతి రిలయన్స్ ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ పక్కన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతణ్ని నిజామాబాద్ జిల్లా రాజంపేటకు చెందిన సతీష్ కుమార్ (32)గా గుర్తించారు. మద్యం బాటిల్ పగలగొట్టి గొంతు కోసి హత్య చేశారని సమాచారం. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 25, 2025

జనగామ: ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సర్దుబాటు..!

image

జిల్లాలోనీ మండల పరిషత్, మున్సిపాలిటీ, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 15,954 దరఖాస్తుల వివరాలను సరిచేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రజాపాలన కేంద్రాల ద్వారా ప్రజా పాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో తప్పులు ఉన్న వాటిని సవరించినట్లు పేర్కొన్నారు.

News September 25, 2025

వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

image

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.

News September 25, 2025

నిర్మల్ కలెక్టరేట్‌లో దివ్యాంగులకు తిప్పలు

image

జిల్లా కలెక్టరేట్‌లో లిఫ్టులు పనిచేయకపోవడంతో పై అంతస్తులకు వెళ్లేందుకు దివ్యాంగులకు, వృద్ధులకు ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ పనుల నిమ్మిత్తం కలెక్టరేట్‌కు వచ్చిన దివ్యాంగులు, ముసలి వారు పై అంతస్థుతులకు వెళ్లేందుకు నానా తంటాలు పడుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందని వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్ అన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.