News September 24, 2025
అందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: కవిత

వర్గల్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. బుధవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అమ్మవారి కరుణ, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.
Similar News
News September 25, 2025
ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావద్దు: అదనపు కలెక్టర్

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలు సంసిద్ధతపై వివిధ శాఖల విభాగాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
News September 25, 2025
జనగామ: ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సర్దుబాటు..!

జిల్లాలోనీ మండల పరిషత్, మున్సిపాలిటీ, కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 15,954 దరఖాస్తుల వివరాలను సరిచేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రజాపాలన కేంద్రాల ద్వారా ప్రజా పాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో తప్పులు ఉన్న వాటిని సవరించినట్లు పేర్కొన్నారు.
News September 25, 2025
వాంగ్చుక్ ప్రకటనలతోనే లేహ్లో అల్లర్లు: కేంద్రం

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ ప్రకటనలతోనే లద్దాక్లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.