News September 24, 2025

రేవులపల్లి-నందిమల్ల వంతెన కోసం ఎంపీకి వినతి

image

ధరూర్ మండలం రేవులపల్లి-నందిమల్ల మధ్యలో పాత జీవో ప్రకారం వంతెన (HLRB) నిర్మించాలని రేవులపల్లి అఖిలపక్ష కమిటీ సభ్యులు ఎంపీ డీకే అరుణమ్మకు బుధవారం వినతిపత్రం అందజేశారు. వంతెన రేవులపల్లి-నందిమల్ల మధ్య వచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతరాయ, గుర్రాజు, పోస్టు వెంకటయ్య, చెట్టుకింది నర్సింహులు, అంజన్ కుమార్, బండ శ్రీను, లక్ష్మయ్య, రమేశ్ పాల్గొన్నారు.

Similar News

News September 25, 2025

ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రావద్దు: అదనపు కలెక్టర్

image

ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఐడీఓసీలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలు సంసిద్ధతపై వివిధ శాఖల విభాగాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News September 25, 2025

జనగామ: ప్రజాపాలన దరఖాస్తుల వివరాల సర్దుబాటు..!

image

జిల్లాలోనీ మండల పరిషత్, మున్సిపాలిటీ, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చిన 15,954 దరఖాస్తుల వివరాలను సరిచేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 14 ప్రజాపాలన కేంద్రాల ద్వారా ప్రజా పాలనలో చేసుకున్న దరఖాస్తుల్లో తప్పులు ఉన్న వాటిని సవరించినట్లు పేర్కొన్నారు.

News September 25, 2025

వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

image

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.