News September 24, 2025

మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు: కిషన్ రెడ్డి

image

TG: మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలను తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘ప్రపంచ దేశాలన్నీ క్రిటికల్ మినరల్స్ కోసం పోటీ పడుతున్నాయి. సెల్ ఫోన్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు , అగ్రికల్చర్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు వీటికి డిమాండ్ ఉంది. ₹32,000Crతో నేషనల్ మినరల్ క్రిటికల్ మిషన్‌ను ప్రారంభించాం. స్క్రాప్ నుంచి మినరల్స్‌ను తీసే ప్రయత్నం జరుగుతోంది’ అని పేర్కొన్నారు.

Similar News

News September 25, 2025

వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లేహ్‌లో అల్లర్లు: కేంద్రం

image

పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటనలతోనే లద్దాక్‌లో <<17816320>>అల్లర్లు<<>> జరిగాయని కేంద్ర హోంశాఖ ప్రకటన రిలీజ్ చేసింది. పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు సాయంత్రానికి అదుపులోకి వచ్చాయని పేర్కొంది. లద్దాక్ ప్రజలకు రాజ్యాంగపరమైన రక్షణను కల్పిస్తూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వీడియోలను షేర్ చేయొద్దని సూచించింది.

News September 25, 2025

ఒత్తిడి చాలా ప్రమాదకరం: అక్షయ్ కుమార్

image

నేటి ప్రపంచంలో ఒత్తిడి చాలా ప్రమాదకరమని హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఆర్థిక, ఇతర సమస్యలతో ప్రెషర్‌కు గురై జీవితాన్ని కష్టతరం చేసుకోవద్దని ఓ షోలో చెప్పారు. సాదాసీదాగా జీవితాన్ని గడపాలని సూచించారు. తాను అందరిలాగే సెలవులు తీసుకుంటానని, ఏడాదిలో 125 రోజులు బ్రేక్‌లో ఉంటానని పేర్కొన్నారు. ఆదివారాలు, సమ్మర్ వెకేషన్, దీపావళికి 3 రోజులు సెలవులో ఉంటానని పేర్కొన్నారు. సమయపాలన పాటించడం చాలా ముఖ్యమన్నారు.

News September 25, 2025

ఆసియాకప్‌లో భారత్‌దే హవా

image

ఆసియాకప్‌లో 1984 నుంచి టీమ్ఇండియాదే హవా కొనసాగుతోంది. మొత్తం 17 ఎడిషన్లలో 12 సార్లు <<17820873>>ఫైనల్<<>> చేరింది. ఇప్పటివరకు 8 సార్లు విజేతగా, 3 సార్లు రన్నరప్‌గా నిలిచింది. ఇవాళ జరిగే పాక్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో విజేతతో ఈ నెల 28న ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. అటు ఈ టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో భారత ఓపెనర్ అభిషేక్(248), వికెట్ల జాబితాలో బౌలర్ కుల్దీప్(12w) తొలి స్థానాల్లో ఉన్నారు.