News September 24, 2025
AP న్యూస్ రౌండప్

* విజయవాడ పర్యటన ముగించుకొని తిరుమలకు చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్.. శ్రీవారిని దర్శించుకొని బ్రహ్మోత్సవాలకు హాజరు
* తిరుమల శ్రీవారికి 14వ సారి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
* వివేకా హత్య కేసు నిందితులే సీఐ శంకరయ్యను నడిపిస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
* ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ సవరణ బిల్లుతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
Similar News
News February 15, 2026
మదనపల్లెకు టమాటాలు రావడం లేదు..!

మదనపల్లె మార్కెట్కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు. బయట రాష్ట్రాల్లోనూ పంటలు పడటం, రేట్లు తక్కువగా ఉండటంతో వ్యాపారులు అక్కడే కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం 35వేల కిలోల టమాటా మాత్రమే వచ్చింది. 10కిలోల మొదటి రకం రూ.190, రెండో రకం రూ.180, మూడో రకం రూ.160తో అమ్ముడుపోయాయి.
News February 15, 2026
రైతుభరోసా ఒకే విడతలో.. ?

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
News February 15, 2026
పాకిస్థాన్కు ‘ధురంధర్’ డోస్!

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.


