News September 24, 2025
నాకు ఏ కష్టమొచ్చినా వేంకటేశ్వరస్వామి ఆదుకున్నారు: సీఎం

AP: తిరుమల శ్రీవారికి ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందని CM చంద్రబాబు అన్నారు. ‘బ్రహ్మోత్సవాల్లో 14సార్లు పట్టువస్త్రాలిచ్చే అవకాశం కల్పించారు. చిన్నప్పటి నుంచి వేంకటేశ్వరుడిని చూస్తూనే పెరిగా. నాకు ఎలాంటి కష్టం వచ్చినా స్వామి ఆదుకున్నారు. ఆయన దయ వల్లే ఎవరికైనా శాంతి, సౌభాగ్యం. హిందువులుండే ప్రతిచోటా, అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాలి’ అని అన్నారు.
Similar News
News February 8, 2026
మమ్ముట్టి పేరు వెనుక ఆసక్తికర కథ

మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ మెగాస్టార్ మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి ఇస్మాయిల్ పెనిపరంబిల్. కాలేజీ రోజుల్లో తన పేరు పాతగా అనిపించడంతో ‘ఒమర్ షరీఫ్’గా పరిచయం చేసుకునేవారు. అయితే ఒకసారి పాకెట్ నుంచి ఐడీ కార్డు పడిపోవడంతో ఓ స్నేహితుడు మహ్మద్ కుట్టిని ‘మమ్ముట్టి’గా పిలిచాడు. అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంతా ఆ పేరుతోనే పిలిచేవారు. అదే చివరికి స్క్రీన్ నేమ్గా మారింది. తాజాగా ఆయన పద్మభూషణ్ అందుకున్నారు.
News February 8, 2026
వంటింటి చిట్కాలు

* కూరలో పులుపు తక్కువైతే మామిడిపొడితో పాటు కొంచెం పెరుగు వేస్తే టమోటా రుచి వస్తుంది.
* పెరుగుపచ్చడి రుచిగా ఉండాలంటే తాలింపు పెట్టేప్పుడు కొద్దిగా నెయ్యి వేయాలి.
* కట్ చేసిన బెండకాయల మీద నిమ్మరసం చల్లి వంట చేస్తే బెండకాయలమీద జిగురు ఉండదు.
* వెల్లుల్లి రెబ్బలను నీటిలో నానబెట్టి తీస్తే త్వరగా పొట్టు వదిలిపోతుంది.
News February 8, 2026
బలవంతంగా మతం మారిన వారిని తిరిగి తీసుకురావాలి: RSS చీఫ్

RSSలో ఏ కులానికి చెందిన వారైనా అత్యున్నత స్థానాలకు చేరుకోవచ్చని, బ్రాహ్మణుడిగా ఉండటం అర్హత కాదని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. మాతృభాషకు ప్రాధాన్యమిస్తున్నామని, ఇంగ్లిష్ పట్ల తమకు శత్రుత్వం లేదని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు. బలవంతంగా మతం మారిన వారిని ‘ఘర్ వాపసీ’ ద్వారా తిరిగి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్రమ వలసదారులను బహిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.


