News April 5, 2024
1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయాం: KCR

TG: తాము కేవలం 1.8% ఓట్ల తేడాతోనే ఓడిపోయామని కేసీఆర్ అన్నారు. ‘మాకు 38%, మీకు 39.8% ఓట్లు పోలయ్యాయి. మేం ఔట్ కాలేదు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. ప్రతి పంటకు రూ.500 బోనస్ ప్రకటించాలి. ఇవ్వకపోతే మిమ్మల్ని గద్దలెక్క వెంటాడుతా. వదిలిపెట్టను. రైతులు ఉద్యమానికి సిద్ధంగా ఉన్నారు’ అని కేసీఆర్ హెచ్చరించారు.
Similar News
News April 1, 2026
SP ఆధ్వర్యంలో పోలీసుల ఉక్కుపాదం

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో మార్చి నెలలో పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు. 11,741 మంది అనుమానితులను తనిఖీ చేసి 18 మందిని గుర్తించారు. గంజాయి కేసుల్లో 10 మందిని అరెస్ట్ చేసి 24 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. జూద కార్యకలాపాలపై దాడుల్లో 179 మందిని అదుపులోకి తీసుకుని రూ.4.55 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
News April 1, 2026
AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.
News April 1, 2026
ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.


