News September 25, 2025
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఆప్’ పోటీ: జిల్లా అధ్యక్షుడు

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనున్నట్లు జిల్లా కన్వీనర్ బి.వెంకటరమణ బాబు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించారు. రాయదుర్గం, గుంతకల్లు, అనంతపురం, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ పోటీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గౌస్, రాంమోహన్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 25, 2025
ఆ ట్విటర్ అకౌంట్ నాది కాదు: ఎమ్మెల్యే దగ్గుబాటి

తన పేరుతో ఫేక్ ట్విటర్ అకౌంట్ క్రియేట్ చేసి కొందరు ట్వీట్లు చేస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రతిపక్ష నేతలు తనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ అకౌంట్పై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. <<17822177>>ఫేక్<<>> అకౌంట్ను కూటమి నాయకులు ఎవరూ నమ్మొద్దని ఆయన సూచించారు.
News September 23, 2025
కనకదుర్గమ్మను దర్శించుకున్న మన ఎమ్మెల్యేలు

దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గమ్మను మంత్రి సవిత, రాప్తాడు MLA పరిటాల సునీత, శింగనమల MLA బండారు శ్రావణి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించి వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
News September 23, 2025
విజయవాడ శాసనసభా ప్రాంగణంలో మహిళా MLAలు

అనంతపురం జిల్లా మహిళా MLAలు AP అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. రాప్తాడు MLA పరిటాల, పుట్టపర్తి MLA పల్లె సింధూర రెడ్డి, మంత్రి సవిత శాసనసభ ప్రాంగణంలో జ్ఞాపకంగా ఫోటో తీసుకున్నారు. శింగనమల నియోజకవర్గం MLA బండారు శ్రావణి శ్రీ మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.