News September 25, 2025
సీడీఎస్ అనిల్ కుమార్ పదవీకాలం పొడిగింపు

భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(CDS) జనరల్ అనిల్ కుమార్ చౌహాన్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్ 30తో ఆయన పదవీకాలం ముగియనుండగా వచ్చే ఏడాది మే 30 వరకు సర్వీసును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 40 ఏళ్ల పాటు సైన్యంలో పలు హోదాల్లో పనిచేసిన చౌహాన్ 2021 మే నెలలో ఈస్టర్న్ ఆర్మీ కమాండ్ చీఫ్గా పదవీ విరమణ చేశారు. 2022 సెప్టెంబర్లో ఆయనను దేశ రెండో సీడీఎస్గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.
Similar News
News September 25, 2025
DRDOలో 11 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

DRDO పరిధిలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో డిఫెన్స్ టెక్నాలజీ(DIBT)లో 11 పోస్టులకు దరఖాస్తు చేయడానికి రేపే(SEP 26)ఆఖరు తేదీ. వీటిలో రీసెర్చ్ అసోసియేట్, JRF పోస్టులు ఉన్నాయి. రీసెర్చ్ అసోసియేట్కు నెలకు రూ.67వేలతో పాటు HRA, JRFకు రూ.37వేలతో పాటు HRA ఇస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.drdo.gov.in/
News September 25, 2025
మైథాలజీ క్విజ్ – 16

1. శ్రీరాముడి అరణ్యవాసం పూర్తయ్యే వరకు భరతుడు సింహాసనంపై ఏం పెట్టి పరిపాలిస్తాడు.
2. గాంధారి సోదరుడు ఎవరు?
3. కృష్ణుడి బాల్య స్నేహితుడు ఎవరు?
4. దసరా ఉత్సవాల్లో భాగంగా కర్రలాటకు(బన్నీ ఉత్సవం) ప్రసిద్ధి చెందిన దేవరగట్టు ఎక్కడ ఉంది?
5. అధికారం చెలాయించే క్షత్రియులను శిక్షించి, భూమిపై ధర్మాన్ని స్థాపించడం కోసం విష్ణువు ఏ అవతారాన్ని ఎత్తాడు?
– సమాధానాలు సా.6 గంటలకు
<<-se>>#mythologyquiz<<>>
News September 25, 2025
గ్రూప్-1: మొదటి ర్యాంకు ఎవరికంటే?

TG: గ్రూప్-1 తుది <<17820908>>ఫలితాల్లో<<>> లక్ష్మీదీపికకు తొలి ర్యాంక్ దక్కింది. హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్కు చెందిన లక్ష్మీదీపిక మెయిన్స్ ఫలితాల్లో 550 మార్కులు సాధించారు. రెండు, మూడు ర్యాంకుల్లో వెంకట రమణ, వంశీకృష్ణారెడ్డి నిలిచారు. మల్టీజోన్-1లో 258, జోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను TGPSC ఎంపిక చేసింది. టాప్-10 ర్యాంకర్లు ఆర్డీవో పోస్టులు ఎంచుకున్నట్లు ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు.