News September 25, 2025

పెండింగ్ కేసులు తగ్గించండి: ఎస్పీ

image

పెండింగ్ కేసులు తగ్గించాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. కేసుల ఛేదనకు టెక్నాలజీ ఉపయోగించాలన్నారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. ప్రతీ కేసును 60 రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. వివిధ అంశాలపై చర్చించారు.

Similar News

News September 25, 2025

క్విజ్ పోటీల్లో పాల్గొనండి: కలెక్టర్

image

జిల్లా యువజన సంక్షేమ శాఖ-సెట్కూరు ఆధ్వర్యంలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్(VBYLD) క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. ఈ క్విజ్‌లో 15-29 ఏళ్ల యువత ఉచితంగా పాల్గొనవచ్చన్నారు. జాతీయ యువజన ఉత్సవం-2026లో భాగంగా నిర్వహిస్తున్న ఈ పోటీలు అక్టోబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. తెలుగు సహా 12 భాషల్లో బహుళైచిక ప్రశ్నల రూపంలో నిర్వహించనున్నట్లు వివరించారు.

News September 25, 2025

నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి

image

నీటి కుంటలో పడి ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం వెలుగు చూసింది. కర్నూలు మండలం పసుపుల సమీపంలో నీటి కుంటలో పడి సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థి శ్రీనివాసులు(17) మృతి చెందాడు. కళాశాలకు వెళ్లి ఇంటికి చేరకుండా నీటి కుంటలో శవమై తేలాడు. విద్యార్థి మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు తాలూకా పోలీసులు నలుగురు విద్యార్థులను విచారిస్తున్నారు.

News September 25, 2025

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా అవినాష్ శెట్టి

image

అంతర్జాతీయ యోగా సమైక్య డైరెక్టర్‌గా కర్నూలు జిల్లాకు చెందిన యోగా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టిని నియమిస్తూ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ, అంతర్జాతీయ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధర్మచారి మైత్రీవనం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2025 నుంచి 2028 వరకు అవినాష్ శెట్టి పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. అవినాష్ శెట్టికి క్రీడాకారులు అభినందనలు తెలిపారు.