News September 25, 2025

కంచిలి: లారీ ఎక్కించి ఇద్దరిని చంపిన డ్రైవర్..!

image

కంచిలి(M) జలంతరకోట జంక్షన్ సమీపంలో హైవేపై బుధవారం రాత్రి జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ కంటైనర్ డ్రైవర్ దాబాలో భోజనం చేశాడు. డబ్బులు చెల్లించే క్రమంలో హోటల్ ఓనర్ మహమ్మద్ హయాబ్‌తో అతనికి తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హోటల్ యజమానితో పాటు మరో వ్యక్తి పై నుంచి డ్రైవర్ లారీని పోనివ్వడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ఎస్సై పారినాయుడు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 27, 2025

వైసీపీ డిజిటల్ బుక్ లాంచింగ్ చేసిన తమ్మినేని

image

వైసీపీ అధిష్టానం ఆదేశాల మేరకు డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరుగుతుందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డిజిటల్ బుక్ లాంచింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైసీపీ నాయకులపై చేస్తున్న అక్రమాలపై బుక్‌లో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

News September 27, 2025

శ్రీకాకుళం జిల్లాకు తుఫాన్ అలెర్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 29 వరకు తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భారత వాతావరణశాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం ఒడిశా – ఉత్తరాంధ్ర మద్య తీరం దాటుతుందన్నారు. గ్రామ స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని, చెట్లు కింద ఉండరాదన్నారు.

News September 27, 2025

శ్రీకాకుళంలో మీకిష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ?

image

శ్రీకాకుళం జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుదీర్ఘ సముద్ర తీరం, నదీ పరీవాహక ప్రాంతాలు, ఎత్తైన కొండలు, పలు జలపాతాలు, విస్తారమైన వివిధ రకాల తోటలు, విదేశీ పక్షుల విడిది కేంద్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కలబోత మన శ్రీకాకుళం జిల్లా. ప్రభుత్వం దృష్టి సారిస్తే అనేక పర్యాటక ప్రదేశాలు నిత్యం కళకళలాడుతూ ఉంటాయి. మరి మీకు ఇష్టమైన పర్యాటక ప్రదేశం ఏది ? కామెంట్ చేయండి.