News September 25, 2025

27న రాజమండ్రిలో జాబ్ మేళా: కలెక్టర్

image

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో సెప్టెంబర్ 27వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ప్రకటించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ పూర్తిచేసిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి అర్హులని తెలిపారు. ఆసక్తిగల యువత తమ సర్టిఫికెట్లు, వాటి జీరాక్స్ కాపీలతో తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె సూచించారు.

Similar News

News September 25, 2025

కౌలు రైతులకు రుణాలు అందించాలి: కలెక్టర్

image

సీసీఆర్‌సీ కార్డులు ఉన్న కౌలు రైతులందరికీ తప్పనిసరిగా వ్యవసాయ రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. రుణాల మంజూరులో బ్యాంకులు రైతులకు ఇచ్చే పాస్‌బుక్‌లలో వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కౌలు రైతుల ఆర్థికాభివృద్ధికి సహకరించాలని ఆమె కోరారు.

News September 25, 2025

రాజమండ్రి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 60 కేసులు నమోదు

image

రాజమండ్రిలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ఎండి. అబ్దుల్ నబీ సారధ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 60 కేసులను నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 51 మందికి జరిమానా విధించగా, ఆరుగురికి రెండు రోజులు, ముగ్గురికి మూడు రోజులు చొప్పున మొత్తం 9 మందికి కోర్టులో జైలు శిక్ష పడింది.

News September 25, 2025

రాజమండ్రి: జిల్లాకు భారీ వర్ష సూచన

image

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు జిల్లా వ్యాప్తంగా అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. లోతట్టు భూభాగాలు, నదీ తీర ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున, క్షేత్రస్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.